చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా కార్తికేయ2 సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా కార్తికేయ సినిమాకు సీక్వెల్ అన్న సంగతి కూడా విదితమే. కార్తికేయ సినిమా సుబ్రహ్మణ్యస్వామి నేపథ్యంలో తెరకెక్కగా ఇప్పుడు కార్తికేయ 2 ద్వారకా, కృష్టుడు బ్యాక్ డ్రాప్ లో వస్తుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ ను బట్టి ఆ విషయం అర్థమవ్వగా.. ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెంచేశారు. ఈసినిమాను కూడా మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో రూపొందించినట్టు అర్థమవుతుంది. ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం కలిగింది అందరికీ. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా టీమ్ కృష్ణుని జన్మస్థలమైన మధుర లోని ఇస్కాన్ నుండి ప్రత్యేకమైన ఆహ్వానం లభించింది. ఇక ఈవిషయాన్ని చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తూ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా తెలియచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియోలో నిఖిల్ మాట్లాడుతూ.. కార్తికేయ టీంకి మధుర బృందావన్ ఇస్కాన్ హెడ్ ఆఫీస్ నుంచి స్పెషల్ ఇన్విటేషన్ వచ్చింది. మన సినిమా కాన్సెప్ట్, టీజర్ చూసి కృష్ణుడికి సంబంధించి ఉండటంతో అక్కడికి వచ్చి భక్తులతో మాట్లాడమన్నారు. సినిమా గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇది నిజంగా చాలా సంతోషమైన విషయం. రేపు అక్కడే సినిమాకి సంబంధించి ఇంకో టీజర్ రిలీజ్ చేస్తాము. అలాగే సినిమా కొత్త డేట్ ని ప్రకటిస్తాము” అని తెలిపారు.
Team #Karthikeya2 have Received an Invitation from A Special Organisation 😇🙏🏽 All Language Trailer1 and Release date announcement from the Holy city of Brindavan 🚩 #ISKCON
Details here 👇🏼 @AAArtsOfficial @vishwaprasadtg @chandoomondeti @anupamahere @AnupamPKher @Actorysr pic.twitter.com/vsNZW9OLOy— Nikhil Siddhartha (@actor_Nikhil) July 18, 2022
కాగా ఈసినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా శ్రీనివాస్ రెడ్డి బాలీవుడ్ దర్శకనిర్మాత అనుపమ్ఖేర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫి అందిస్తుండగా ..కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: