సినీ సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా మృత్యువాత పట్టడంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకుంటున్నాయి. ఎంతోమంది లెజెండరీ నటీనటుల్నీ ఎంతోమంది కళాకారులను కోల్పోయింది చిత్ర పరిశ్రమ. ఇప్పుడు మరో సీనియర్ నటుడిని కోల్పోవాల్సి వచ్చింది. ఆ సీనియర్ నటుడు ఎవరో కాదు మలయాళం యాక్టర్, ఫిలిం మేకర్ అయిన ప్రతాప్ కె పోతెన్. నేడు ఉదయం చెన్నైలోని అపార్ట్ మెంట్లో ఆయన తుది శ్వాస విడిచారు. తెలుగు, తమిళ్, మలయాళం ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖులు, నటీనటులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు సంతాపం ప్రకటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా 1952 ఆగష్ట్ 13వ తేదీన జన్మించారు ప్రతాప్ పోతెన్. ఊటీలోని లవ్డేల్లోని లారెన్స్ స్కూల్లో పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత, అతను గ్రాడ్యుయేషన్ కోసం మద్రాసు క్రిస్టియన్ కాలేజీలో చేరారు. అనంతరం ముంబై యాడ్ ఏజెన్సీలో కాపీ రైటర్గా తన వృత్తిని ప్రారంభించారు. ఇక 1978 వ సంవత్సరంలో ఆరవం సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఇక ఇప్పటివరకూ ఆయన తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఆయన ఎన్నో సినిమాల్లో చేశారు. తెలుగులో ఆయన ‘ఆకలి రాజ్యం’, ‘కాంచనగంగ’, ‘మరో చరిత్ర’, ‘వీడెవడు’ వంటి చిత్రాల్లో నటించారు. ప్రతాప్ పోతెన్ నటుడిగా మాత్రమే కాదు పలు చిత్రాలకు డైరెక్టర్గా నిర్మాతగా కూడా ఆయన వ్యవహరించారు. చివరిగా మమ్ముట్టి నటించిన సీబీఐ5.. ది బ్రెయిన్ అనే సినిమాలో కనిపించారు.
ఇదిలా ఉంటే ఆయన వైవాహిక జీవితానికి వస్తే మొదట ప్రతాప్ పోతెన్ సీనియర్ నటి రాధికను వివాహం చేసుకున్నారు. వీరి బంధం ఒక ఏడాది పాటు మాత్రమే నిలిచింది. 1985లో రాధికతో వివాహం జరుగగా 1986లోనే వీరిద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు. అనంతరం అమల సత్యనాథ్ ను వివాహం చేసుకున్నారు. దాదాపు 22 ఏళ్ల వివాహ బంధాన్ని కొనసాగించిన వీరిద్దరూ ఆ తర్వాత డివోర్స్ తీసుకొని విడిపోయారు. వీరికి కియా అనే కూతురు ఉంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: