రాజ్యసభ సభ్యులు సంతోష్కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ప్రారంభించగా ఇప్పటివరకూ ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాము మొక్కలు నాటడంతో పాటు మరికొందరిని నామినేట్ చేస్తూ.. వారు కూడా మొక్కలు నాటేలా చేస్తూ..అందరూ కలిసి విజయవంతంగా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను ముందుకు తీసుకెళుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఈ ఛాలెంజ్ లో ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కూడా పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ లోని ప్రశాసన్ నగర్ జీహెచ్ఎమ్సీ పార్క్ లో కీరవాణి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం మణిశర్మ, సింగర్ సునితకు ఛాలెంజ్ విసిరారు. ఈ సందర్భంగా కీరవాణి మాట్లాడుతూ..మనం మనుషులతోనే మాట్లాడతాం, మనుషుల్నే జీవులుగా పరిగణిస్తాం. కానీ మొక్కలు మనకన్న గొప్పవి. ఏ స్వార్థం లేకుండా మనం బ్రతకడానికి కావల్సిన ఆక్సిజన్ ను అందిస్తాయి. మనం బ్రతకాలంటే చెట్లు కావాలి.. చెట్లు కావాలంటే “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లో మొక్కలు నాటాలి. వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని అత్యంత ప్రేమతో కొనసాగిస్తున్న రాజ్యసభ సభ్యులు “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” సృష్టికర్త జోగినిపల్లి సంతోష్ కుమార్ ను మనస్పూర్తిగా అభినందిస్తున్నట్టు తెలిపారు. ఇక కీరవాణి తో పాటు ఈకార్యక్రమంలో సింగర్స్ అరుణ్ కౌండిన్య,అమల చేబోలు, మోహన బోగరాజు,హైమత్ మొహమ్మద్,గోమతి, రాహుల్ సిప్లిగంజ్ కూడా పాల్గొని మొక్కలు నాటారు.
I have accepted the #GreenIndiaChallenge from @MPsantoshtrs garu & planted saplings at JubileeHills. I hereby nominate my dear friend @manisharma #vandemataramsrinivas and @OfficialSunitha and all my fans to take up this challenge in order to control global warming. 🌱 pic.twitter.com/RfCftxEGa9
— mmkeeravaani (@mmkeeravaani) July 14, 2022
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: