పెద్ద పెద్ద సినిమాలకు, భారీ బడ్జెట్ సినిమాలకు సినిమా టికెట్లు పెంచడం చూస్తూనే ఉన్నాం. ఈమధ్య రిలీజ్ అయిన పెద్ద సినిమాలు టికెట్ రేట్లను పెంచుకోగా ఎఫ్ 3 లాంటి సినిమా మాత్రం సాధారణమైన రేట్లకే సినిమా టికెట్లను అందుబాటులో ఉంచారు. రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమాలు కూడా దాదాపు టికెట్ రేట్లను పెంచకుండానే రిలీజ్ చేశారు. అయితే తాజాగా ది వారియర్ సినిమా టికెట్ రేట్లను పెంచింది. లింగుస్వామి దర్శకత్వంలో రామ్ హీరోగా వస్తున్న సినిమా ది వారియర్. ఈసినిమా జులై 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్ రిలీజ్ అయి సినిమాపై మంచి అంచనాలు పెంచేసింది. ఇక సెన్సార్ కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీగా ఉండగా మరోవైపు చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లను ఫిక్స్ చేశారు మేకర్స్. తెలంగాణాలో ‘ది వారియర్’ చిత్రం కోసం మల్టీప్లెక్స్ లకు రూ. 295 లు, సింగిల్ స్క్రీన్స్ కు రూ. 175 లు రేటు నిర్ణయించగా.. ఆంధ్రప్రదేశ్ లో మల్టీప్లెక్స్ లకు రూ. 177 లు, సింగిల్ స్క్రీన్స్ కు రూ. 147 లు రేట్లను ఫిక్స్ చేశారు.
కాగా యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈసినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. ఇంకా ఆది పినిశెట్టి, అక్షర గౌడ, వరలక్ష్మీశరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు.ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: