ఇస్మార్ట్ శంకర్, రెడ్ వంటి వరుస హిట్లతో మంచి ఫామ్ లోకి వచ్చిన రామ్ ఇప్పుడు మరో పవర్ ఫుల్ కథతో రాబోతున్నాడు. కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామితో ఫుల్ యాక్షన్ ఎంటర్ తో ప్రేక్షకులను మరోసారి ఎంటర్ టైన్ చేయడానికి వచ్చేస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో రామ్ మొదటిసారి పోలీస్ ఆఫిసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈసినిమా జులై 14న రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు చిత్రబృందం. ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలు రిలీజ్ అయి సినిమాపై భారీ అంచనాలే పెంచేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా తమిళ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చెన్నైలోని ‘సత్య సినిమాస్’లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే కదా. సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుంచి ఈ కార్యక్రమం మొదలుకానుంది. ఇక ఈవేడుకకు ఒకరు కాదు రెండు కాదు ఏకంగా 28 మంది సెలబ్రిటీలు హాజరుకానున్నారు. స్టార్ హీరోలు .. హీరోయిన్లు .. దర్శక నిర్మాతలు వాళ్లలో ఉన్నారు. వాళ్ల పేర్లను ప్రకటిస్తూ ఈ సినిమా మేకర్స్ ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.
కాగా యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈసినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. ఇంకా ఆది పినిశెట్టి, అక్షర గౌడ, వరలక్ష్మీశరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు.ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: