సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ పర్సన్ అని అందరికీ తెలిసిందే. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా తన ఫ్యామిలీకి ఇవ్వాల్సిన టైమ్ లో మాత్రం అస్సలు కాంప్రమైజ్ కాడు. ఇక ఎప్పటిలాగే సర్కారు వారి పాట సినిమా రిలీజ్ అయిన వెంటనే ఫ్యామిలీతో కలిసి ట్రిప్ కు వెళ్లిపోయారు. కుటుంబంతో కలిసి ఆయన అమెరికా ట్రిప్కు వెళ్లిన మహేష్ నమ్రత శిరోద్కర్, పిల్లలు గౌతమ్ కృష్ణ, సితారతో కలిసి ఈ వెకేషన్ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక అక్కడ సంబంధించిన కొన్ని ఫొటోలను మహేష్ బాబు తన సోషల్ మీడియా ద్వారా అభిమానుల కోసం షేర్ చేస్తూనే ఉన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు తాజాగా మరో ఫొటోను షేర్ చేశాడు. న్యూయార్క్ లో ఆయన మైక్రోసాప్ట్ ఫౌండింగ్ చైర్ పర్సన్, టెక్ దిగ్గజం బిల్ గేట్స్ ని కలిశారు. ఆయనతో కలిసి దిగిన ఫోటోని మహేష్ బాబు షేర్ చేశారు. బిల్ గేట్స్ గొప్పతనాన్ని వివరిస్తూ కామెంట్స్ జత చేశారు. బిల్ గేట్స్ను కలుసుకోవడం తనకు చాలా ఆనందంగా ఉందని.. ఇప్పటివరకు తాను చూసిన, ప్రపంచంలో ఉన్న అతి గొప్ప వ్యక్తుల్లో బిల్ గేట్స్ ఒకరని.. అందరూ గౌరవించదగ్గ వ్యక్తిగా పోస్ట్ లో పేర్కొన్నారు.
View this post on Instagram
ఇక మహేష్ బాబు తన తరువాత సినిమా త్రివిక్రమ్ తో చేయనున్నాడు. ఈసినిమా ఇప్పటికే లాంచ్ అయింది. జులై ఎండింగ్ నుండి కానీ ఆగష్ట్ నుండి కానీ ఈసినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది అంటున్నారు. ఈసినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: