‘మత్తు వదలరా’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ రితేష్ రానా ఇప్పుడు తన రెండవ చిత్రం హ్యాపీ బర్త్డే తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈసినిమాలో లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. దీంతో ఈసినిమాకు బజ్ బాగానే క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈసినిమాలో నటిస్తున్న కీలక పాత్రలకు సంబంధించిన పోస్టర్లను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ వచ్చారు. మరోవైపు ఇప్పటికే టీజర్ కూడా రిలీజ్ చేయగా అది కూడా మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకుంది. థ్రిల్లర్ కామెడీ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కినట్టు టీజర్ ను బట్టి అర్థమవుతుంది. ఇక ఈసినిమా నుండి ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయనున్నారు. దీనికి సంబంధించిన అప్ డేట్ ను తాజాగా ఇచ్చారు మేకర్స్. రేపు జూన్ 29వ తేదీన సాయంత్రం 4గంటల 5 నిమిషాలకు ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి చేతుల మీదుగా ఈ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు చిత్రబృందం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాలో నరేష్ అగస్త్య, సత్య, వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ – క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ల పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. కాల భైరవ సంగీతం అందిస్తుండగా సురేష్ సరంగం సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.
ఇక ఈసినిమా రిలీజ్ డేట్ ను కూడా మార్చిన సంగతి తెలిసిందే కదా. నిజానికి ఈసినిమా జులై 15వ తేదీన రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఒక వారం ముందుగానే రిలీజ్ చేయడానికి డిసైడ్ అయ్యారు. రీసెంట్ గానే కొత్త రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. జులై 8వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈసినిమా ఎలాంటి విజయం అందుకుంటుందో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: