నాగ్ ఆశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో ఒక ఈసినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ప్రాజెక్ట్ కే అనే వర్కింగ్ టైటిల్ తో ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఇదిలా ఉండగా ప్రాజెక్ట్ కే మూవీ కోసం వైజయంతి సంస్థ గచ్చిబౌలిలో కొత్త ఆఫీస్ ని ప్రారంభించింది. ఈ ఆఫీస్ ప్రారంభోత్సవానికి ప్రభాస్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు, దర్శకుడు ప్రశాంత్ నీల్, న్యాచురల్ స్టార్ నాని, మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హాజరయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా అమితాబ్ తన ట్విట్టర్ లో వీరితో తీసుకున్న ఫొటోను పోస్ట్ చేస్తూ అందరినీ ఒకేసారి కలిసినందుకు చాలా హ్యాపీగా ఫీలవుతున్నట్టు తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
T 4330 – What an evening ..
Prabhas – Bahubali ; Prashant – KGF2 ; Raghavendra Rao – legendary director producer ; Nani – star ; Dulquer – star ; Nagi Ashwin – director Project K, that I currently work in ..
And as I am in the car , a knock on the window and its Aamir !! pic.twitter.com/9iRBZSaxuZ— Amitabh Bachchan (@SrBachchan) June 28, 2022
అత్యంత భారీ బడ్జెట్తో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె నటిస్తున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో అమితాబచ్చన్ ఇంకా దిశా పటాని కూడా నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రభాస్ రేంజ్కి తగ్గట్టుగా నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ రేంజ్ లో భారీ బడ్జెట్తో రూపొందించనున్నారు. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
ఇక ప్రస్తుతం ప్రభాస్ పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నసంగతి తెలిసిందే కదా. అందులో ఆది పురుష్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో పూర్తి చేసుకుంటుంది. ఇంకా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సలార్ సినిమా కూడా షూటింగ్ దశలో ఉంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: