అల్లరి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన నరేష్ మొదటి సినిమానే తన ఇంటి పేరుగా మార్చుకొని ఇండస్ట్రీలో కామెడీ హీరోగా పేరుతెచ్చుకున్నాడు అల్లరి నరేష్. ఇక ఆ తరువాత వరుసగా కామెడీ సినిమాలనే చేస్తూ వచ్చాడు. అయితే ఇప్పుడు కాస్త విభిన్నంగా సినిమాలు, విభిన్నమైన పాత్రలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఈనేపథ్యంలోనే గత ఏడాది నాంది సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పూర్తి స్థాయిలో నరేష్ ఈ చిత్రంలో సీరియస్ రోల్ పోషించాడు. కమర్షియల్గా కూడా ఈ చిత్రం మంచి విజయం సాధించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం రాజ్మోహన్ దర్శకత్వంలో ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం చేస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇక మరోవైపు ఈసినిమా నుండి తాజాగా అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా నుండి ప్రీ టీజర్ ను రిలీజ్ చేశారు.
Team work, Vision & passion!
Check out the pre-teaser of @allarinaresh #ItluMaredumilliPrajaneekam 🔥
▶️🔗 – https://t.co/YRHqji7ME1 #ImpPreTeaser #IMP @anandhiactress @raajmohan73 @HasyaMovies @RajeshDanda_ @lemonsprasad @_balajigutta @abburiravi @SricharanPakala pic.twitter.com/AVuAc6iMpd
— Zee Studios (@ZeeStudios_) June 28, 2022
కాగా కాగా ఈసినిమాలో నరేష్ ఎలక్షన్ అధికారిగా కనిపించనున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆనంది ఈసినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా.. వెన్నెల కిషోర్, చమ్మక్ చంద్ర ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ సమర్పణలో హాస్య మూవీస్ బ్యానర్పై రాజేష్ దండ ఈసినిమాను నిర్మిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈసినిమాకు రామ్ రెడ్డి సినిమాటోగ్రాఫర్.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: