కామెడీ ఎంటర్ టైనర్ సినిమాలతోనే ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిన అల్లరి నరేష్ ఇప్పుడు తన రూట్ మార్చేశాడు. ప్రస్తుతం ప్రేక్షకులు కూడా ప్రయోగాత్మక సినిమాలనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు కాబట్టి ఆ దిశగానే అడుగులు వేస్తున్నాడు. ఆ క్రమంలోనే నాంది లాంటి సినిమాతో తన రీఎంట్రీకి నాంది పలికాడు. ప్రస్తుతం అయితే రాజ్మోహన్ దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా వస్తున్న సినిమా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈసినిమా కూడా డిఫరెంట్ కథతో తెరకెక్కుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాతో పాటు మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నరేష్. నాంది డైరెక్టర్ విజయ్ కనకమేడలతోనే రెండో సినిమాను చేయనున్నాడు. ఈమేరకు అధికారికంగా ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. పోస్టర్ మాత్రం ఆసక్తికరంగా ఉంది. సంకెళ్లు ఉన్న రెండు చేతులు.. గోడపై పక్షి నీడలా కనిపించేలా డిజైన్ చేశారు. ఈ పోస్టర్ ట్విట్టర్ లో షేర్ చేసిన అల్లరి నరేష్ ‘షాడో ఆఫ్ హోప్ అని హ్యాష్ ట్యాగ్ చేశాడు. మరి ఈసినిమా కూడా డిఫరెంట్ గానే ఉండేలా కనిపిస్తుంది.
𝐓𝐡𝐞𝐬𝐞 𝐒𝐡𝐚𝐜𝐤𝐥𝐞𝐬 𝐈’𝐯𝐞 𝐌𝐚𝐝𝐞
𝐈𝐧 𝐚𝐧 𝐀𝐭𝐭𝐞𝐦𝐩𝐭 𝐭𝐨 𝐛𝐞 𝐅𝐫𝐞𝐞Embrace the #ShadowOfHope and Shower all your blessings for our new Endeavour 🤩❤️
🌟ing ACTOR @allarinaresh & directed by @VijayKKrishna#NareshVijay2 @sahugarapati7 @harish_peddi pic.twitter.com/UdIzMGZQne
— Shine Screens (@Shine_Screens) June 27, 2022
‘కాగా నరేష్ కెరీర్ లో 60వ సినిమాగా వస్తున్న ఈసినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ షూటింగ్ పూర్తయిన వెంటనే కొత్త చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులను ప్రకటించాల్సి ఉంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: