ఏ వి ఎం ప్రొడక్షన్స్ బ్యానర్ పై శంకర్ ఎస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన తొలి చిత్రం ”శివాజీ: ది బాస్” తమిళ మూవీ 2007 జూన్ 15 నరిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. హీరో రజినీ కాంత్ కు జోడీగా శ్రియ నటించారు. ప్రతినాయకుడు ఆదిశేషుగా సుమన్ అలరించారు. ఏ.ఆర్.రెహమాన్ ఈ సినిమాకు అద్భుతమైన సంగీతం సమకూర్చారు. తెలుగులోనూ ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. అప్పటికి డబ్బింగ్ సినిమాల్లో హైయ్యస్ట్ వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
బ్లాక్ బస్టర్ ”శివాజీ: ది బాస్” మూవీ దిగ్విజయంగా 15 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు శంకర్ తన కుమార్తెతో పాటుగా రజినీకాంత్ ను ఆయన నివాసంలో కలుసుకున్నారు. దర్శక హీరోలిద్దరూ కాసేపు ముచ్చటించారు. ఈ విషయాన్ని శంకర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ.. సూపర్ స్టార్ తో ఉన్న ఫోటోను పంచుకున్నారు.”శివాజీ” చిత్రానికి 15 సంవత్సరాలు పూర్తయిన ఈ మరపురాని రోజున “శివాజీ ది బాస్” రజనీకాంత్ సార్ ని స్వయంగా కలిసినందుకు సంతోషిస్తున్నాననీ , మీ ఎనర్జీ ఆప్యాయత మరియు పాజిటివ్ ఆరా ఈరోజును గుర్తుండి పోయేలా చేసాయనీ శంకర్ ట్వీట్ చేశారు. చాలా కాలం తర్వాత అగ్ర దర్శక హీరోలను ఒకే ఫ్రేమ్ లో చూసిన అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇద్దరూ కలిసి మరో బ్లాక్ బస్టర్ సినిమా చేయాలని.. కుదిరితే ‘శివాజీ: ది బాస్’ చిత్రానికి సీక్వెల్ తీయాలని సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు.’శివాజీ’ సినిమా తర్వాత రజినీ కాంత్ – శంకర్ కలయికలో ‘రోబో’ మరియు ‘2.O’ సినిమాలు రూపొందిన సంగతి తెలిసిందే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: