ప్రస్తుతం వస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో మోస్ట్ అవైటెడ్ సినిమా ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సలార్ ఒకటి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో అవ్వడం.. ప్రశాంత్ నీల్ డైరెక్టర్ అవ్వడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో కె.జి.యఫ్ చిత్రాన్ని మించిన థ్రిల్ కలిగించే యాక్షన్ సన్నివేశాలను రెడీ చేస్తున్నాడట ప్రశాంత్నీల్. ఇక ఈసినిమా ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే కదా. కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం ఈసినిమా కొత్త షెడ్యూల్ ను హైద్రాబాద్ లో మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. హైద్రాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో నేటి నుండి స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది. యాక్షన్ ప్యాక్డ్ తో ఈ షెడ్యూల్ ను ప్లాన్ చేసినట్టు సమాచారం. ఈ షెడ్యూల్ లో పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కించనున్నారట.
కాగా ఈసినిమాలో ప్రభాస్ కు జోడీగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. హోంబలే ఫిలిమ్స్ పతాకంపై బ్లాక్ బస్టర్ మూవీ ‘కె.జి.యఫ్’ నిర్మించిన విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇక కన్నడ స్టార్ మధు గురుస్వామి ప్రభాస్ కు విలన్గా చేస్తున్నాడు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు ఈసినిమాకు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: