టాలెంటెడ్ నటి సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.డ్యాన్స్, యాక్టింగ్ స్కిల్స్తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. మలయాళ చిత్రం “ప్రేమమ్” తో హీరోయిన్ గా సిల్వర్ కు పరిచయమైంది సాయి పల్లవి. మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత “ఫిదా” తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ టాలెంటెడ్ బ్యూటీ… ఇక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాదు బెస్ట్ హిట్ ను అందుకుంది. ఆతరువాత “ఎంసీఏ” తో మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకుని స్టార్ డమ్ ను అందుకుంది. ఇక మంచి నటిగా గుర్తింపు పొందడమే కాదు.. సాయి పల్లవి పాత్ర ప్రధానమైన సినిమాలనే చేస్తుందన్న నమ్మకం కూడా ఉంది అందరికీ. ఇక సాయి పల్లవికి యూత్ లో క్రేజ్ కూడా అదే రేంజ్ లో ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక సాయి పల్లవికి సెలబ్రిటీల్లో కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఆలిస్ట్ లో మరో స్టార్ డైరెక్టర్ అండ్ నిర్మాత చేరిపోయారు. ఆ నిర్మాత ఎవరో కాదు కరణ్ జోహార్. రానా-సాయి పల్లవి జంటగా వస్తున్న సినిమా విరాట పర్వం. ఇక ఈసినిమా ట్రైలర్ ను రెండు రోజుల క్రితం రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక ట్రైలర్ పై కరణ్ జోహార్ సోషల్ మీడియా ద్వారా ప్రశంసలు కురిపించారు. ట్రైలర్ అద్భుతంగా ఉంది రానా! సినిమా చూసేందుకు వేచి ఉండలేకపోతున్నా. ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.. నేను సాయిపల్లవికి పెద్ద అభిమానిని అంటూ ట్వీట్ చేశాడు కరణ్ జోహార్. దీంతో ఇప్పుడు ఈట్వీట్ వైరల్ గా మారింది.
This looks fantastic Rana!!!! Can’t wait to see it! Intense Raw and Rivetting!!! You are superb! And I am a huge @Sai_Pallavi92 fan! ❤️ https://t.co/FpvsbHQhQ2
— Karan Johar (@karanjohar) June 6, 2022
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: