మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై కుటుంబ కథా చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ , సమంత జంటగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “ఖుషి ″మూవీ ఫస్ట్ షెడ్యూల్ కశ్మీర్ లో జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ షెడ్యూల్ లో విజయ్ , సమంత పాల్గొన్నారు. ఈ మూవీ లో సచిన్ ఖేద్కర్ , మురళీశర్మ , లక్ష్మి ,అలీ , రోహిణి , వెన్నెల కిషోర్ , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. హేషం అబ్దుల్ వాహెబ్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Fake news pic.twitter.com/dbneXS8h5s
— Shiva Nirvana (@ShivaNirvana) May 24, 2022
కశ్మీర్ లో విజయ్ దేవరకొండ , సమంత లపై దర్శకుడు శివ నిర్వాణ పలు అందమైన లొకేషన్స్ లో కీలక సన్నివేశాలు తెరకెక్కించారని సమాచారం. తాజాగా”ఖుషి” మూవీ కశ్మీర్ షెడ్యూల్ పూర్తి చేసుకుని చిత్ర యూనిట్ హైదరాబాద్ కు చేరుకుంది. “ఖుషి” సినిమా షూటింగ్ సమయంలో ఒక ప్రమాదం జరిగిందనీ , ఆ ప్రమాదంలో సమంత, విజయ్ దేవరకొండ గాయపడినట్లుగా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. ఆ వార్తలలో ఎలాంటి నిజం లేదని చిత్ర యూనిట్ అఫీషియల్ గా మీడియాకు వివరణ ఇచ్చింది. దర్శకుడు శివ నిర్వాణ ఆ వార్తలపై స్పందించి ఫేక్ న్యూస్ అంటూ ట్వీట్ చేశారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: