టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. అయితే గత కొంతకాలంగా నిఖిల్ కు కూడా సరైన హిట్ లేక స్లో అయ్యాడు. ఇక ప్రస్తుతం అయితే డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ ఈ ఏడాది కనీసం రెండు సినిమాలు అయినా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. అందులో ఒకటే స్పై సినిమా. గ్యారీ బిహెచ్ దర్శకత్వంలో ఈసినిమా రాబోతుంది. ఇక ఈసినిమా నిఖిల్ కెరీర్లోనే తొలి పాన్ ఇండియా మూవీగా రాబోతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా పూర్తిగా థ్రిల్లర్ మూవీగా రానుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలే క్రియేట్ అయ్యాయి. ఇదిలా ఉండగా ఈసినిమా కోసం హాలీవుడ్ టీమ్ కూడా రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది. హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ కైకో నహకరా ఇంకా యాక్షన్ డైరెక్టర్ లీ విటేకర్ పనిచేస్తున్నారు. ఇక దీంతో ఈసినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ ఇంకా పెరిగాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
#spy
.@actor_Nikhil @Garrybh88 @tej_uppalapati #edentertainment#krajashekarreddy pic.twitter.com/dO1UJZkdft— ISWARYA MENON (@Ishmenon) May 21, 2022
కాగా ఈసినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా.. మనోజ్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నాడు. దర్శకత్వంతో పాటు గారీ ఈసినిమాకు ఎడిటర్ గా కూడా వ్యవహరించనున్నాడు. ఇక తాజా సమాచారం ప్రకారం ఈసినిమాను కూడా ఈ ఏడాదే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దసరా బరిలో ఈసినిమాను దించాలని చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తున్నారట.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.