సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ మే 12 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ వచ్చినా బ్లాక్ బస్టర్ గా మారి తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మహేష్ బాబు తన స్టైలిష్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ఈ మూవీ లో సాంగ్స్ , ఫైట్స్ ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకున్నాయి. మహేష్ బాబు , కీర్తి ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. “సర్కారు వారి పాట” మూవీ ప్రపంచవ్యాప్తంగా 170 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ తో 200కోట్ల క్లబ్ దిశగా దూసుకుపోతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“సర్కారు వారి పాట” మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తన మనసులోని మాట ను వెల్లడించారు. తాను దర్శకుడినైతే “ఒక్కడు “మూవీ ని రీ క్రియేట్ చేయాలనుకుంటున్నా అని మహేష్ బాబు చెప్పారు. గుణశేఖర్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ఒక్కడు “మూవీ ఘనవిజయం సాధించి 8 నంది , 4 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకుంది. “ఒక్కడు “మూవీ తమిళ , కన్నడ , బెంగాలీ , హిందీ , సింహళ భాషలలో రీమేక్ అయ్యి ఆ భాషలన్నిటి లోనూ విజయం సాధించడం విశేషం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: