30 ఏళ్ల తరువాత శంకరాభరణం మేకర్స్..!

Shankarabharanam Movie Makers Back After 30 Years,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Shankarabharanam,Shankarabharanam Movie,Shankarabharanam Movie Updates,Shankarabharanam Movie Makers Latest Updates,Shankarabharanam Movie Makers Back After 30 Years, Movie Makers of Shankarabharanam Bavk After 30 Years,Blockbuster Movie Shankarabharanam Movie Makers are Back,k viswanath Directrd Movie Shankarabharanam,First Day First Show Movie Updates, Anudeep Upcoming Movie First Day First Show latest Updates,First Day First Show Telugu Movie,First Day First show Movie

ఒకప్పుడు సినీ పరిశ్రమల్లో ప్రొడక్షన్ హౌస్ లు కొద్ది సంఖ్యలోనే ఉండేవి.అందులో ఎన్నో టాప్ ప్రొడక్షన్ హౌస్ లు ఎన్నో సూపర్ హిట్ మూవీస్ ను అందించాయి. అప్పట్లో ఉన్న నిర్మాణ సంస్థల్లో ఏవో కొన్ని మాత్రమే ఇంకా సినిమాలు నిర్మిస్తున్నాయి తప్పా చాలా సంస్థలు ఇప్పుడు కనిపించడంలేదు. దానికి కొత్త కొత్త నిర్మాణ సంస్థలు రావడం కూడా ఒక కారణమని చెప్పొచ్చు. ప్రస్తుతం రోజుకో ప్రొడక్షన్ సంస్థ పుట్టుకొస్తుంది. ఎవరికి వారే తమ సొంత ప్రొడక్షన్ హౌస్ లు స్థాపించుకుంటూ తమ సినిమాలను తామే నిర్మించుకుంటున్నారు. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ ఒకప్పుడు క్లాసిక్ మూవీస్ అందించిన నిర్మాణ సంస్థలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఏడిద నాగేశ్వరరావు.. సినిమా పరిజ్ఞానం ఉన్న ఎవరికైనా ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పూర్ణోదయ పిక్చర్స్ పై ఈయన ఎన్నో క్లాసిక్ మూవీస్ ను తెలుగు సినీ ప్రేక్షకులకు అందించారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది శంకరాభరణం. కళాతపస్వీ కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈసినిమా ఈ బ్యానర్ పైనే నిర్మించారు. ఇంకా సీతాకోక చిలుక, సితార, స్వయం కృషి, సాగర సంగమం లాంటి ఆణిముత్యాలను అందించారు ఈ బ్యానర్ ద్వారా. అయితే ఈయన తరువాత ఈ బ్యానర్ నుండి ఆయన వారసత్వం ద్వారా సినిమాలు రాలేదు. ఇక ఇప్పుడు దాదాపు 30 ఏళ్ల తరువాత మళ్లీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

ఏడిద శ్రీరామ్ కూతురు ఏడిద శ్రీజ నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఆమె నిర్మిస్తున్న తాజా చిత్రం ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’. జాతి రత్నాలు ఫేమ్ ఫేమ్ అనుదీప్ కథ అందిస్తున్న ఈసినిమాకు వంశీధర్ గౌడ్ లక్ష్మీ నారాయణ దర్శకులుగా పరిచయం అవుతున్నారు. శ్రీజ ఎంటర్ టైన్ మెంట్స్, మిత్రవింద ఫిలింస్ బ్యానర్లపై పై ఏడిద శ్రీరామ్ సమర్పణలో ఈసినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈవిషయాన్ని పూర్ణోదయ పిక్చర్స్ వారు తమ ట్విట్టర్ ద్వారా అధికారికంగా తెలియచేశారు. ఈ చిత్రానికి సంగీతం రధన్ అందిస్తున్నాడు. ఈసినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియచేయనున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − two =