సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ మే 12 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి హిట్ టాక్ స్వంతం చేసుకొని తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మహేష్ బాబు తన స్టైలిష్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు.మహేష్ బాబు కామెడీ టైమింగ్ సినిమాలో మెయిన్ హైలైట్ గా నిలిచింది. ఈ మూవీ లో సాంగ్స్ , ఫైట్స్ ప్రేక్షక , అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి.మహేష్ బాబు , కీర్తి ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. “సర్కారు వారి పాట ” మూవీ ఆంధ్ర , తెలంగాణ రాష్ట్రాలలో ఫస్ట్ డే 36.63 కోట్ల షేర్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“సర్కారు వారి పాట” మూవీ భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న సందర్భంగా సక్సెస్ పార్టీ ని నిర్మాతలు గ్రాండ్ గా ఏర్పాటు చేశారు. ఈ పార్టీ లో సూపర్ స్టార్ మహేష్ బాబు తో పాటు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు , దిల్ రాజు , శిరీష్ , దర్శకులు పరశురామ్ , సుకుమార్ , హరీష్ శంకర్ , బుచ్చిబాబు , మెహెర్ రమేష్ పాల్గొన్నారు. “సర్కారు వారి పాట” సక్సెస్ సెలబ్రేషన్స్ అంటూ నిర్మాతలు ఒక ఫొటో ద్వారా ప్రకటించారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: