మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా సినిమా ‘ఆచార్య’. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈసినిమా కోసం ప్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈసినిమా రిలీజ్ ఇంకా వారం రోజులు మాత్రమే ఉంది. దీంతో ఈసినిమా ప్రమోషన్స్ ను షురూ చేశారు. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన పాటలు, టీజర్, ట్రైలర్ ఈసినిమాపై అంచనాలు పెంచేసింది. ఇక ఈసినిమాలో ఎన్నో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉండగా తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ చోటుచేసుకుంది. ఈసినిమాకు సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందిస్తున్నాడు. దీంతో ఈసినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఈసినిమాకు యూఏ సర్టిఫికెట్ అందించారు సెన్సార్ బృందం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాాగా ఈసినిమాలో చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. చరణ్ సరసన పూజా హెగ్డే
కనిపించనుంది. నిరంజన్ రెడ్డితో కలిసి రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈసినిమా ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మరి ఈసినిమా చిరు కు ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: