గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజా హెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. పామిస్ట్ విక్రమాదిత్య గా ప్రభాస్ , డాక్టర్ ప్రేరణ గా పూజాహెగ్డే అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.”రాధేశ్యామ్ ” మూవీ లో వారిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. లావిష్ గా తెరకెక్కిన “రాధేశ్యామ్” రెండు రోజులలోనే 100 కోట్ల క్లబ్ లో చేరి, 10 రోజులలో ప్రపంచవ్యాప్తంగా 204 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతున్న “రాధేశ్యామ్ “మూవీ కి అద్భుత స్పందన లభించడం విశేషం. ఓటిటి లో ఎక్స్ పీరియన్స్ మరింత బాగుందని ప్రేక్షకులు అంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“రాధేశ్యామ్”మూవీ రిజల్ట్ పై ప్రభాస్ స్పందించారు. ఒక ఇంటర్వ్యూ లో ప్రభాస్ మాట్లాడుతూ .. మహమ్మారి కారణంగా ప్రజలు టెలివిజన్, ఇతర ప్లాట్ఫారమ్లలో చాలా సినిమాలు చూస్తున్నారనీ , కాబట్టి ఫ్యామిలీ అంతా కలిసి కూర్చుని “రాధేశ్యామ్”సినిమాను ఆస్వాదిస్తారని అనుకుంటున్నాననీ , టెలివిజన్ స్క్రీన్పై చూసి “రాధే శ్యామ్”ని ఇష్టపడతారని అనుకుంటున్నాననీ , సినిమా సక్సెస్ కాకపోవడానికి కరోనా లేదా స్క్రిప్ట్లో ఏదైనా మిస్ అయ్యి ఉండవచ్చుననీ , లేదా ఆ జోనర్ లో తనను చూడాలని ప్రేక్షకులు అనుకోవట్లేదేమోననీ ,దర్శకుడు రాజమౌళి తనను “బాహుబలి”గా ప్రపంచానికి పరిచయం చేశారనీ , కొంతమంది తనను అలాంటి పాత్రల లో మాత్రమే చూడాలనుకుంటున్నారనీ , తన సినిమాలకు “బాహుబలి” లాంటి మంచి రెస్పాన్స్ రావాలనే ఒత్తిడి తన దర్శకులు, నిర్మాతలపై ఉందనీ ,”బాహుబలి”ని క్రాస్ చేయాలనీ, అతి పెద్ద సినిమా చేయాలనీతనకు అంత ఒత్తిడి లేదనీ , విభిన్నమైన పాత్రల్లో, మంచి కంటెంట్ తో సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించాలని అనుకుంటున్నాననీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: