మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై దృష్టి పెడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అయి ప్రభంజనం సృష్టిస్తుంది. రామ్ చరణ్ మంచి ప్రశంసలు దక్కాయి. మరోవైపు ఆచార్య సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఈసినిమాలో చిరు ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. చరణ్ కూడా మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. తండ్రీకొడుకులు ఇద్దరూ కలిసి నటిస్తుండటంతో ఈసినిమాపై కూడా అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా ఇప్పటికే కొంత వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. అయితే మధ్యలో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ తో బిజీ అవ్వడం.. ఆచార్య పెండింగ్ షూటింగ్ లో పాల్గొనడంతో ఈసినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. మళ్లీ రీసెంట్ గానే తిరిగి షూటింగ్ ను మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అమృత్ సర్ లో జరుగుతోంది. ఇక అక్కడ షూటింగ్ చేస్తూనే కాస్త బ్రేక్ తీసుకొని అక్కడ బిఎస్ఎఫ్ జవాన్లతో ముచ్చటించారు. అంతేకాదు వారికోసం ప్రత్యేకంగా భోజనం కూడా చేయించి.. వారితో కలిసి భోజనం కూడా చేశారు. ఇక ఈవిషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. వారితో కలిసి మాట్లాడిన తరువాత వారి స్టోరీస్, త్యాగాలు విన్న తరువాత చాలా స్పూర్తిదాయకంగా ఉంది అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు.
View this post on Instagram
ఇక ఈ చిత్రంలో జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: