ఇటీవల కాలంలో సినీ పరిశ్రమలో పలు విషాదాలు ఎదురవుతూనే ఉన్నాయి. గత రెండేళ్లలో కరోనా వల్ల ఎంతో మంది సినీ ప్రముఖులను అలానే వయసు పైబడిన వారు ఇలా ఎన్నో కారణాల వల్ల ఎంతో మందిని కోల్పోయింది సినీ పరిశ్రమ. ఇక ఈ ఏడాది ప్రారంభమైన నాలుగునెలల్లోనే పలువురు సినీ సెలబ్రిటీలు కన్నుమూశారు. ఇక విషాదం నుండి కోలుకునే లోపే మరో విషాదం చోటుచేసుకుంటుంది. ఇటీవలే సీనియర్ కథానాయకుడు బాలయ్య మరణించగా అది మరిచిపోకముందో మరో ప్రముఖ నిర్మాత మరణించిన ఘటన చోటుచేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రముఖ సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఏషియన్ ఫిలింస్ అధినేత నారాయణ్ దాస్ నారంగ్ నేడు కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన తీవ్ర అస్వస్థతో ఇబ్బంది పడుతున్నారు. ఈనేపథ్యంలో స్టార్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటుండగా పరిస్థితి విషమించడంతో ఈరోజు తుది శ్వాస విడిచారు. ఈ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తూ సంతాపం తెలియచేస్తున్నారు.

కాగా మొదట సినిమాలకు ఫైనాన్స్ చేసేశారు. సుమారు 650కు పైగా సినిమాలకు ఆయన ఫైనాన్స్ చేశారు. అలాగే, డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఏషియన్ మల్టీప్లెక్స్, ఏషియన్ థియేటర్స్ అధినేతగా ఉన్న నారాయణ దాస్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ అనే బ్యానర్ను కూడా స్థాపించి నిర్మాతలు పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ భాగస్వామ్యంతో ఇప్పుడు సినిమాలు నిర్మిస్తున్నారు. అందులో ఇప్పటికే రీసెంట్ గా లవ్ స్టోరి, లక్ష్య సినిమాలను నిర్మించారు. అలాగే అక్కినేని నాగార్జునతో ఘోస్ట్ అనే సినిమాను నిర్మిస్తున్నారు. ధనుష్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమాను రూపొందిస్తున్నారు నారాయణ్ దాస్ నారంగ్. ఇంకా పలు సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్గా, మూవీ ఫైనాన్సియర్గా సినీ రంగానికి సేవలు అందిస్తూనే ఆయన ప్రస్తుతం తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్గానూ కూడా కొనసాగుతున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























