ఆంధ్రప్రదేశ్ లో మొదటి మొబైల్ సినిమా ధియేటర్ రూపుదిద్దుకుంటోంది. వెదర్ ప్రూఫ్, ఫైర్ ఫ్రూఫ్ పద్ధతుల్లో వేసిన టెంట్ లో గాలినింపే టెక్నాలజీతో 120 సీట్ల కెపాసిటీతో రూపొందుతున్న ఈ ఏసీ థియేటర్ ను ఎక్కడికైనా తీసుకుపోయి అమర్చుకోవచ్చు. ఏపీలో రాజానగరం వద్ద నేషనల్ హైవే పక్కన హాబిటేట్ ఫుడ్ కోర్టు ప్రాంగణంలో ఈ ధియేటర్ ఏర్పా టు అవుతుంది.పిక్చర్ డిజిటల్స్ సంస్ధ ఆంధ్రప్రదేశ్ లో నెలకొల్పుతున్న మొబైల్ ధియేటర్లలో ఇది మొదటిది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలంగాణ రాష్ట్రంలో ఆసిఫాబాద్లోని మొబైల్ డిజిటల్ థియేటర్ ను జిల్లా సమాఖ్య, పిక్చర్ టైమ్ సంయుక్తంగా ఏర్పాటు చేశారు.ఈ మొబైల్ థియేటర్ లో దర్శకుడు రాజమౌళి “ఆర్ఆర్ఆర్” మూవీ ను వీక్షించిన విషయం తెలిసిందే.రాజానగరం వద్దఈ మొబైల్ థియేటర్ నిర్మాణ పనులు దాదాపు పూర్తికావస్తున్నాయి.కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన “ఆచార్య ” మూవీ తో ఈ మొబైల్ థియేటర్ ప్రారంభం కానుంది. ఒకప్పటి టూరింగ్ టాకీసులకు ఆధునికమైన, సౌకర్యవంతమైన రూపమే ఈ మొబైల్ థియేటర్.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: