బ్లాక్ బస్టర్ “ఉప్పెన“మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కృతి శెట్టి ఆ మూవీ లో తన అందం అభినయం తో ప్రేక్షకులను అలరించారు. “ఉప్పెన “మూవీ సక్సెస్ తో కృతి శెట్టి పలు మూవీ అవకాశాలు అందుకుంటున్నారు. 2021 సంవత్సరం లో కృతి శెట్టి “ఉప్పెన “, “శ్యామ్ సింగ రాయ్” మూవీస్ తో టాలీవుడ్ లో విజయం సాధించారు. 2022 లో “బంగార్రాజు ” మూవీతో కృతిశెట్టి హ్యాట్రిక్ సాధించారు. కృతి శెట్టి ప్రస్తుతం “ది వారియర్ “, “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి”,“మాచర్లనియోజకవర్గం” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.బాలా దర్శకత్వంలో సూర్య హీరో గా తెరకెక్కనున్న తమిళ మూవీలో కృతిశెట్టి ఒక కథానాయికగా ఎంపిక అయ్యారు. ఈ మూవీ తో కృతిశెట్టి కోలీవుడ్ లో అడుగుపెడుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా కృతిశెట్టి తమిళంతో పాటు బాలీవుడ్ గ్రాండ్ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.స్టార్ హీరో షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కనున్న బాలీవుడ్ మూవీ లో కృతిశెట్టి కథానాయికగా ఎంపిక అయినట్టు సమాచారం. మొదటి సినిమాతోటే స్టార్ డమ్ అందుకున్న కృతి 20 ఏళ్లు కూడా లేకుండానే స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో రాణిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ హాటెస్ట్ హీరోయిన్గా కొనసాగుతున్న కృతి ఒకేసారి కోలీవుడ్ , బాలీవుడ్ లలో తన లక్ పరీక్షించుకోబోతున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: