చాణిక్య చిన్న దర్శకత్వంలో తిృగున్, పూజిత పొన్నాడ జంటగా వస్తున్న సినిమా కథ కంచికి మనం ఇంటికి. ఈసినిమా ఇప్పటికే రిలీజ్ కావల్సింది కానీ లేట్ అయింది. మార్చిలో రిలీజ్ చేద్దామనకున్నారు కానీ కుదరలేదు. ఇక ఇప్పుడు ఫైనల్ ఏప్రిల్ 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను ట్రైలర్ ను రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈసినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్ లో భాగంగా చిత్రయూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా పూజిత పొన్నాడ మాట్లాడుతూ “ఈ ఏడాది విడుదలవుతున్న నా తొలి సినిమా ‘కథ కంచికి మనం ఇంటికి’. హారర్ నేపథ్యంలో రూపొందిన కామెడీ ఎంటర్టైనర్ ఇది. ఇందులో నా క్యారెక్టర్ విషయానికి వస్తే… దీక్ష పాత్ర చేశా. తనకు బెట్టింగ్ అంటే ఇష్టం. ప్రతిసారీ బెట్ గెలుస్తుంది. ఆ డబ్బును ఛారిటీకి ఇస్తుంది. బెగ్గర్స్ కోసం ఇస్తుంది. ఇటువంటి పాత్ర చేయడం ఛాలెంజింగ్గా, ఆసక్తికరంగా అనిపించింది. రచయితగా ‘మిర్చి’ హేమంత్, దొంగగా ‘గెటప్’ శీను చేశారు. హీరో హీరోయిన్లతో పాటు వీళ్ళ పాత్రలు కూడా సినిమాలో కీలకం. ఫస్టాఫ్ అంతా సరదాగా ఉంటుంది. సెకండాఫ్ హారర్ జోనర్ లో ఉంటుంది. అక్కడ కూడా ఫన్ మిస్ అవ్వదు.
ఈ సినిమాలో నాకు యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి. సాధారణంగా ఎంత మంది హీరోయిన్లకు యాక్షన్ చేసే ఛాన్స్ వస్తుంది చెప్పండి? దర్శకుడు కథ వివరించినప్పుడు 40 అడుగుల ఎత్తులో మీరు యాక్షన్ చేయాలని చెప్పారు. నాకు యాక్షన్ చేయడం అంటే ఇష్టమని చెప్పాను. ఫస్ట్ ఫ్లిఫ్స్ చేసినప్పుడు నా ముఖానికి దెబ్బలు తగులుతాయేమోనని భయపడ్డా. రెండు మూడు రిహార్సిల్స్ చేసిన తర్వాత ఈజీగా చేశా. ఫైట్ మాస్టర్ దగ్గరకు వెళ్లి ఇంకా యాక్షన్ సీన్స్ పెట్టమని అడిగా. సెకండాఫ్ లో ఒక యాక్షన్ సీన్ ఆడియన్స్ కు సర్ప్రైజ్ ఇస్తుంది” అని చెప్పారు.
ఇంకా తన సినిమాల గురించి చెబుతూ.. తెలుగులో రవితేజ గారితో ‘రావణాసుర’, పవన్ కళ్యాణ్ గారితో ‘హరిహర వీరమల్లు’, ‘ఆకాశ వీధిలో’, ‘జోరుగా హుషారుగా’, ‘ఓదెల రైల్వే స్టేషన్’ సినిమాలు చేస్తున్నాను. ఓటీటీ కోసం ఒక యాంథాలజీ చేస్తున్నాను. ఈ ఏడాది నేను తమిళ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవుతున్నాను. ఆరితో ‘భగవాన్’, శ్రీరామ్ గారితో ‘ట్రైనర్’ సినిమాలు చేస్తున్నాను. గాళ్ నెక్స్ట్ డోర్ కాకుండా డిఫరెంట్ షేడ్స్ ఉన్న రోల్స్ చేస్తున్నాను” అని చెప్పారు.
కాగా ఈసినిమాలో ఇంకా మహేష్ మంజ్రేకర్, సప్తగిరి, వినోద్ కుమార్, శ్యామల, హేమంత్ , గెటప్ శ్రీను తదితరులు నటిస్తున్నారు. యమ్.పి ఆర్ట్స్ బ్యానర్పై మోనిష్ పత్తిపాటి నిర్మాతగా ఈసినిమా తెరకెక్కుతుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు.. వైయస్ కృష్ణ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: