సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి , రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ఆచార్య “మూవీ ఏప్రిల్29 వ తేదీ రిలీజ్ కానుంది.మెగా స్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో “గాడ్ ఫాదర్ “, మెహెర్ రమేష్ దర్శకత్వంలో “భోళా శంకర్ “, బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం లో “చిరంజీవి 154 “మూవీ సెట్స్ పైన ఉన్నాయి. చిరంజీవి ఒకే సారి ఈ మూడు సినిమాలలో నటించడం విశేషం. ఈ మూవీస్ కాకుండా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక మూవీ కి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలుగు రాష్ట్రాలలో ఈ నెల 26, 27న రాజమండ్రిలో, వరంగల్లో 29, 30న, హైదరాబాద్లో ఏప్రిల్1 నుంచి 3 వరకు అఖిల భారత సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి చిరంజీవి అతిథిగా హాజరవనున్నారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెప్పే దేశం మనదనీ , . ఆ మహోన్నత సంస్కృతిని ప్రతిబింబించేలా జాతీయ సాంస్కృతిక మహోత్సవాలను భారత ప్రభుత్వం ఈసారి మన తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించడం మన అందరికీ గర్వకారణం అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: