లెజండరీ యాక్టర్,కన్నడ కంఠీరవ రాజ్కుమార్, పార్వతమ్మ దంపతులకు 1975వ సంవత్సరం మార్చి 17వ తారీఖున పునీత్ రాజ్ కుమార్ జన్మించారు . “ప్రేమద కనికే ” (1976) మూవీ తో బాలనటుడిగా కన్నడ చిత్ర పరిశ్రమకు పరిచయం అయిన పునీత్ బాల నటుడి గా పలు చిత్రాలలో నటించారు. “బెట్టడ హోవు “(1985 ) మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి పునీత్ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నారు. సూపర్ హిట్ “అప్పు “(2002) మూవీ తో హీరోగా మారారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో కన్నడ ప్రేక్షకులను అలరించిన యాక్టర్ , సింగర్ , ప్రొడ్యూసర్ , టీవీ ప్రేసెంటర్ పునీత్ 2021 అక్టోబర్ 29 వ తేదీ కార్డియాక్ అరెస్ట్ తో 46 సంవత్సరాల వయసులో పరమపదించి కన్నడ చిత్ర పరిశ్రమ , అభిమానులను శోక సంద్రంలో విడిచారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
1999 లో డిసెంబర్ 1 వ తేదీన పునీత్ , అశ్వనీ రేవంత్ ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు తనయలు. కన్నడ చిత్ర పరిశ్రమలో పునీత్ హైయెస్ట్ పైడ్ యాక్టర్ గా రాణించారు. పలు సాంగ్స్ ను పునీత్ అద్భుతంగా ఆలపించారు. మానవతావాది గా పునీత్ 26 అనాథ ఆశ్రమాలు , 15 ఫ్రీ స్కూల్స్ , 16 ఓల్డ్ ఏజ్ హోమ్స్ , 19 గోశాలలు మెయిన్ టైన్ చేశారు. పునీత్ చివరిగా తన కళ్ళను దానం చేశారు.
పునీత్ రాజ్ కుమార్ హీరోగా తెరకెక్కిన ఆఖరు మూవీ “జేమ్స్”ఆయన బర్త్ యానివర్సరీ (మార్చి 17)రోజున 4000 స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: