నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్తో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు మేకర్స్. మరి అంత పెద్ద ప్రాజెక్ట్ ను రూపొందించాలంటే అంత సులవైన విషయం ఏం కాదు. ప్రతి చిన్న విషయంలోనూ ఎంతో జాగ్రత్తగా అంతే క్రియేటివిటీగా తీయాలి. అందుకే డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా ఈసినిమాకోసం చాలానే కష్టపడుతున్నారు. దీనిలో భాగంగానే తాజాగా నాగ్ అశ్విన్ గ్లోబల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ చీఫ్ వేలుతో కలిసి చెన్నైలోని మహీంద్రా రీసెర్చ్ వ్యాలీని సందర్శించారు. ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. క్యాంపస్ అద్భుతంగా ఉంది. ప్రకృతితో మమేకమైనట్టుంది. వేలు మహేంద్ర, అతని బృందంతో కలిసి ఈ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది.. ఆనంద్ మహీంద్రా సర్కు థ్యాంక్స్ అని నాగ్ అశ్విన్ ట్వీట్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
What a beautiful campus, where nature meets cutting edge tech…a fruitful start to our journey with @Velu_Mahindra and team..thank you so much @anandmahindra sir. This promises to be v exciting.🙏 #mahindraresearchvalley #projectk pic.twitter.com/FH7kJ8VP53
— Nag Ashwin (@nagashwin7) March 13, 2022
కాగా ఈసినిమాలో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె నటిస్తున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో అమితాబచ్చన్ నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రభాస్ రేంజ్కి తగ్గట్టుగా నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ రేంజ్ లో భారీ బడ్జెట్తో రూపొందించనున్నారు. మహానటి సినిమాకు పని చేసిన స్పానిష్ టెక్నీషియన్ డానీ సాంచెజ్ లోపెజ్ ఈ సినిమాకు కూడా సినిమాటోగ్రాఫర్గా పని చేయనుండగా… అలాగే మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: