టాలీవుడ్ లో ఉన్న క్యూట్ కపుల్స్ లో అల్లు అర్జున్-స్నేహారెడ్డి జంట కూడా ఒకటి. అన్యోన్య దాంపత్యం అని కొంతమంది దంపతులను చూస్తే అనాలనిపిస్తుంది. ఇక అల్లు అర్జున్-స్నేహారెడ్డి ని చూసిన ఎవరికైనా అలా అనాలనే అనిపిస్తుంది. బన్నీ సినిమాలతో బిజీగా ఉంటూనే ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో అందరికీ తెలుసు. సినిమాలు షూటింగ్ లంటూ బిజీగా ఉన్నా కుటుంబానికి టైమ్ కేటాయిస్తూనే ఉంటాడు. ఫ్యామిలీతో స్పెషల్ గా ట్రిప్ లకు సైతం వెళుతుంటాడు. ఇక మరోపక్క స్నేహా రెడ్డి కూడా బన్నీకి సపోర్డ్ గా ఉంటూనే పిల్లలను చూసుకుంటూ.. మరోవైపు బిజినెస్ లలో కూడా ఒక చేయి వేస్తూనే బిజీ లైఫ్ ను లీడ్ చేస్తుంది. ఈ క్యూట్ కపుల్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గానే ఉంటారు. తమ వ్యక్తిగత విషయాలకు సంబంధించిన విషయాలతో పాటు బన్నీ సినిమాలకు సంబంధించిన విషయాలు ముఖ్యంగా పిల్లలు అయాన్-అర్హలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా ద్వారా పంచుకంటూ ఉంటారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా వీరి వివాహ బంధం నేటితో 11 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో నేడు మ్యారేజ్ యానివర్సరీ కావడంతో అల్లు అర్జున్ ఇంట్లో భార్యా, పిల్లలతో కలిసి నిరాడంబరంగా జరుపుకున్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోను అల్లు అర్జున్ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు.
కాగా అల్లు అర్జున్ ఇటీవల డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేసిన సంగతి తెలిసిందే. గతేడాది విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో బన్నీ సరసన కన్నడ బ్యూటీ రష్మిక మందన్న నటించింది. ఇక పుష్ప2 షూటింగ్ ను త్వరలో మొదలుపెట్టనున్నట్టు తెలుస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: