టాలెంటెడ్ హీరో రానా రీసెంట్ గా నటించిన భీమ్లానాయక్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు తన ఫోకస్ ను నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై పెడుతున్నాడు. కొత్త సినిమాలను అలానే పెండింగ్ లో ఉన్న సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డాడు. దీనిలో భాగంగానే తను చేస్తున్న విరాట పర్వం సినిమాను కూడా వీలైనంత త్వరగా రిలీజ్ చేస్తాం అంటున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వేణు ఉడుగుల దర్శకత్వంలో యంగ్ హీరో రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా వస్తున్న సినిమా ‘విరాటపర్వం’. నిజానికి ఈసినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా అన్ని సినిమాలకు వచ్చినట్టే ఈసినిమాకు కూడా కరోనా వల్ల బ్రేక్ వచ్చింది. అయితే మిగిలిన సినిమాలు ఏదో ఒక లాగ షూటింగ్ ను పూర్తి చేసుకొని రిలీజ్ అయ్యాయి.. కానీ ఈసినిమా మాత్రం ఇంతవరకూ రిలీజ్ కు నోచుకోలేకపోయింది. మధ్యలో ఈసినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు అన్నారు.. ఆ తర్వాత మేకర్స్ లేదు లేదు థియేటర్లలోనే రిలీజ్ చేస్తున్నామని అన్నారు. మరి ఓటీటీ లోనా లేక థియేటర్ల లోనా అన్న దానిపై ఇప్పటికీ రిలీజ్ విషయంలో క్లారిటీ లేదు.
ఇక తాజాగా ఈ విషయంలో క్లారిటీ ఇచ్చాడు రానా. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రానా ఈసినిమా గురించి మాట్లాడుతూ..ఈ సినిమా రీ రికార్డింగ్ పూర్తయిందని, ఒకటి రెండు రోజుల్లో సినిమా ప్రివ్యూ చూడబోతున్నా అని తెలిపారు. అంతేకాదు ఇప్పటికే ఈసినిమా చాలాసార్లు రిలీజ్ డేట్ల ను ఫిక్స్ చేసుకుంది.. కానీ రిలీజ్ కాలేదు.. త్వరలోనే ఓ మంచి రిలీజ్ డేట్ని ఫిక్స్ చేసి వీలైనంత త్వరగా విరాటపర్వంను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని రానా క్లారిటీ ఇచ్చారు.
కాగా యదార్ధ సంఘటనల ఆధారంగా 1990 కాలంనాటి విప్లవ కథగా ఈ చిత్రం తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రియమణి ఒక కీలక పాత్రలో కనిపించనుంది. భారతక్కగా ప్రియమణి రోల్ చాలా పవర్ ఫుల్ గా ఉండనుంది. ఇంకా ఈసినిమాలో నందితా దాస్, ఈశ్వరీ రావ్,జరీనా వహాబ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీని ఎస్ ఎల్ వి సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ పై సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: