రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే కలిసి నటిస్తున్న చిత్రం ‘రాధేశ్యామ్’. 1960 నాటి కాలంలో ఇటలీ నేపథ్యంలో వింటేజ్ ప్రేమకథ గా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. కరోనా వల్ల పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన రాధేశ్యామ్ సినిమా.. ఎట్టకేలకు మార్చి 11న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే మళ్లీ ప్రమోషన్స్ మొదలెట్టింది చిత్ర యూనిట్. దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా నుండి రెండో ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ కు కూడా సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ట్రైలర్ విజువల్ వండర్ గా ఆకట్టుకుంది. ముఖ్యంగా ట్రైలర్ చివర్లో వచ్చే షిప్ ఎపిసోడ్ ట్రైలర్ లో ప్రత్యేకంగా కనిపించగా సినిమాలో ఇదే హైలెట్ కాబోతుందని చెప్పుకుంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ప్రభాస్ సినిమా కాబట్టి ఇప్పటికే భారీ స్థాయిలో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఎన్నో కొత్త కొత్త ఫీట్లను రీచ్ అవుతుంది ఈసినిమా. ఇప్పటికే యూఏస్ లో అత్యధిక స్క్రీన్ లలో రిలీజ్ అవుతున్న సినిమాగా రాధేశ్యామ్.. మొదటి సౌత్ హీరో గా రికార్డ్ క్రియేట్ చేయగా ప్రభాస్ రికార్డ్ క్రియేట్ చేయగా.. ఇప్పుడు మరో రికార్డును నెలకొల్పింది. ఈసినిమా ట్రైలర్ ను మెటావర్స్ లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ నిర్ణయించుకుంది. ఈ తరహా విడుదల ప్రపంచం లోనే మొట్ట మొదటి సారి అని తెలుస్తుంది.
View this post on Instagram
కాగా ఈసినిమాలో కృష్ణంరాజు, సచిన్ ఖేడేకర్, ప్రియదర్శి, రిద్ధి కుమార్, సాషా చెత్రి, కునాల్ రాయ్ కపూర్, భాగ్యశ్రీ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక సౌత్ లో ఈ సినిమా పాటల కోసం జస్టిన్ ప్రభాకరన్ పనిచేస్తుండగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను థమన్ అందించనున్నాడు. ఇక హిందీ పాటలకి మిథున్, అమాల్ మాలిక్, మనన్ భరద్వాజ్ సంగీతం సమకూర్చారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: