టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు వారసుడిగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో ఆశిష్. హుషారు సినిమా ఫేం శ్రీహర్ష కనుగంటి దర్శకత్వంలో కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన రౌడీ బాయ్స్ తో ఎంట్రీ ఇచ్చాడు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. ఇక మొదటి సినిమాతోనే తన మార్క్ ను చూపించాడు ఆశిష్. నటనలో అక్కడక్కడా కాస్త లోపాలు కనిపించినా ఓవరాల్ గా మాత్రం హీరోకు ఉండాల్సిన లక్షణాలు అన్నీ అశిష్ కు పుష్కలంగా ఉన్నాయన్న ప్రశంసలు దక్కించుకున్నాడు. ఇక ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. అంతేకాదు ఈసినిమాలో అనుపమ కాస్త గ్లామర్ డోస్ పెంచిందనే చెప్పొచ్చు.
.
ఇక ఇప్పుడు ఈసినిమా ఓటీటీ లో రిలీజ్ కు కూడా సిద్దమైంది. ఈసినిమా రిలీజ్ అప్పుడే దిల్ రాజు ఈసినిమాను 50 రోజుల తరువాతే సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇక చెప్పినట్టే అలానే ఇప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ మేకర్స్ ప్రకటించారు. మార్చి 11 వ తేదీన ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 ప్రీమియంలో ఈ సినిమా విడుదల కానున్నట్టు తెలియచేస్తూ ఈ మేరకు పోస్టర్ కూడా విడుదల చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Revisit your college life with#RowdyBoys, Premiering on @ZEE5Telugu on March 11th. https://t.co/fhUUfhutNw
— Sri Venkateswara Creations (@SVC_official) February 28, 2022
కాగా ఈసినిమాలో ఇంకా సాహిదేవ్ విక్రమ్ , కార్తీక్ రత్నం , కోమలి ప్రసాద్, అయ్యంగార్, జయప్రకాష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ ఈసినిమాను నిర్మించగా..లసంగీతం.. దేవి శ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫి..మది అందించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: