టాలీవుడ్ లో ప్రస్తుతం యంగ్ హీరోల సందడి ఎక్కువైపోయింది. స్టార్ హీరోల కంటే యంగ్ హీరోలే హిట్స్ ఫ్లాప్స్ ను లెక్కచేయకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఇక ఇప్పుడు కీరవాణి తనయుడు శ్రీ సింహా కూడా అదే జోరు కొనసాగిస్తున్నాడు. మొదటి సినిమా ‘మత్తు వదలరా’ లాంటి భిన్నమైన సినిమాను తీసి విమర్శకుల ప్రసంశలు సైతం దక్కించుకున్నాడు శ్రీ సింహా. ఆ తరువాత తెల్లవారితే గురువారం సినిమాతో ప్రేక్షకుల మందుకు వచ్చాడు. అయితే ఆసినిమా అంత విజయాన్ని అందించలేకపోయింది. ఇక ప్రస్తుతం కొత్త ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడు. ప్రణీత్ బ్రమాండపల్లి దర్శకత్వంలో శ్రీ సింహ నటిస్తున్న సినిమా భాగ్ సాలే. ఇక ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాతో పాటు శ్రీ సింహా దొంగలున్నారు జాగ్రత్త సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సతీష్ త్రిపుర దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈ మూవీతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు సతీష్. అయితే చాలా రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయినప్పటికీ.. కరోనా కారణంగా సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఇటీవలే ఈసినిమా షూటింగ్ మళ్లీ స్టార్ట్ చేశారు. ఇక తాజాగా ఈసినిమా నుండి అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. నేడు శ్రీ సింహా పుట్టినరోజు సందర్బంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్రబృందం.
కాగా ప్రీతి ఆస్రాని హీరోయిన్గా నటిస్తున్న ఈసినిమాను సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. రోహిత్ కులకర్ణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. యశ్వంత్ సి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. మరి ఈసారి దొంగగా మారిన శ్రీ సింహా ఎంతవరకూ ఆకట్టుకుంటాడో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: