పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు రానా అభిమానులు కూడా ఎదురుచూస్తున్న టైమ్ రానే వచ్చేసింది. ఇంకా కొద్ది గంటల్లో పవన్ కళ్యాణ్ – రానా కాంబినేషన్ లో తెరకెక్కిన క్రేజీ మల్టీస్టారర్ భీమ్లానాయక్ సినిమా రిలీజ్ కాబోతుంది. మరోవైపు చిత్రయూనిట్ కూడా ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈసినిమా పాటలు, టీజర్, ట్రైలర్ సోషల్ మీడియాలో ఎంత క్రేజ్ ను సొంతం చేసుకున్నాయో చూశాం. అంతేకాదు అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ లో కూడా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది ఈ సినిమా. ఇక ఇప్పుడు చిత్రయూనిట్ కు మరో బంపరాఫర్ ఇచ్చింది టీఎస్ ప్రభుత్వం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పవన్ సినిమా అంటే క్రేజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. తెలంగాణ ప్రభుత్వం ఈ చిత్రానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 11వ తేదీ వరకు థియేటర్లలో ఐదో ఆటను ప్రదర్శించుకోవడానికి అనుమతిని ఇచ్చింది. ఈ వార్తతో సినిమా యూనిట్ తో పాటు, పవన్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఏపీలో పరిస్థితి ఎలా ఉంటుందో అన్నది చూడాలి.
కాగా సాకర్ కే. చంద్ర దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాలో పవన్ కు జోడీగా నిత్యామీనన్ నటించగా, రానా జోడీగా సంయుక్త మీనన్ కనిపించనుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ఈసినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ప్లే అందిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: