పరుశురామ్ దర్శకత్వంలోమహేష్ బాబు, కీర్తీ సురేష్ హీరో, హీరోయిన్లుగా వస్తున్న సినిమా సర్కారు వారి పాట. ప్రస్తుతం ఈసినిమా మిగిలిన షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఇప్పుటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, ఇంకా బ్లాస్టర్ పేరుతో ఒక వీడియో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే బ్లాస్టర్ కు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో చూశాం. బ్లాస్టర్ తోనే సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఇక ఇప్పుడు ఫస్ట్ సింగిల్ కూడా రికార్డులు క్రియేట్ చేస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వాలెంటైన్స్ డే సందర్భంగా ఒక రోజు ముందే ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేసి ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. వందో ఒక వెయ్యో, ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా.. ఏందే నీ మాయా..’ అంటూ సాగే ఈపాటను సిద్ శ్రీరామ్ పాడగా.. అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించాడు. ఇక ఇప్పుడు ఫస్ట్ సింగిల్ కూడా రికార్డులు క్రియేట్ చేయడం మొదలుపెట్టేసింది. ఈపాట సూపర్ రెస్పాన్స్ సాధించడంతో పాటు సోషల్ మీడియాలో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. 24 గంటల్లో ఈపాట 16 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకోవడమే కాదు సౌత్ మోస్ట్ వ్యూస్ ను దక్కించుకున్న పాటగా రికార్డు క్రియేట్ చేసింది. అంతేకాదు.. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో 8 లక్షలకు పైగా లైక్స్ ను సొంతం చేసుకున్న ఫస్ట్ పాటగా మరో రికార్డును సొంతం చేసుకుంది. మరి ఇంకా పలు పాటులు ఉన్నాయి.. టీజర్ రిలీజ్ అవ్వాలి.. ట్రైలర్ ఉంది. ఇవి ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తాయో చూడాలి.
కాగా మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నాయి. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇక బ్యాంకింగ్ రంగంలోని కుంభకోణాల చుట్టూ కథ సాగుతోందని ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలసిందే కదా. మే 12న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: