మంచు మోహన్ బాబు వారసత్వంగా ఇండస్ట్రీలోకి ఆయన తనయులు మంచు విష్ణు, మంచు మనోజ్ హీరోలుగా ఎప్పుడో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఆతరువాత కూతురు మంచు లక్ష్మీ కూడా బుల్లి తెర ఎంట్రీ ఇచ్చి.. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై సందడి చేస్తుంది. ప్రస్తుతం ఎవరి ప్రాజెక్ట్ లతో వాళ్లు బిజీగా ఉన్నారు. అయితే మోహన్ బాబు తో మంచు విష్ణు, మంచు మనోజ్ ఇప్పటికే స్క్రీన్ షేర్ చేసుకున్నారు కానీ మంచు లక్ష్మీ మాత్రం ఇప్పటివరకూ చేయలేకపోయింది. కానీ మొదటిసారి ఇప్పుడు తండ్రీకూతుళ్లు ఇద్దరూ కలిసి స్క్రీన్ ను షేరు చేసుకోబోతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
బాలీవుడ్ డైరెక్టర్ ప్రతీక్ ప్రజోష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో మోహన్ బాబు, లక్ష్మీ ఇద్దరూ నటిస్తున్నారు. చిత్రం ఈ రోజు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమయ్యింది. మహిళా దర్శకురాలు నందినిరెడ్డి ఫస్ట్ షాట్ కి దర్శకత్వం వహించగా, మంచు మనోజ్ కెమెరా స్విచ్ఛాన్ చేసారు. మంచు అవరామ్, మంచు విద్యా నిర్వాణ స్క్రిప్ట్ అందజేశారు. ఇక ఈవిషయాన్ని మంచు లక్ష్మీ కూడా సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తూ తన తండ్రి తో చేసే అవకాశం దక్కినందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది.
Today is a day I have always dreamt of living and here it is. I ll be sharing the screen with none other than my dad for the very first time. I am so grateful to the universe, my angels and my ancestors for guiding me and making me so capable enough for this day. #blissed pic.twitter.com/UwsaNzCwSI
— Lakshmi Manchu (@LakshmiManchu) February 12, 2022
ఇంకా ఈసినిమాలో మళయాళం స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సిద్దిక్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ & మంచు ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. డైమండ్ రత్నబాబు స్టోరీ, డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాకి కెమెరామెన్ సాయిప్రకాష్, మ్యూజిక్ ప్రియదర్శన్ బాలసుబ్రమణ్యం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: