సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో షూటింగ్ లతో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీకి ఇవ్వాల్సిన టైమ్ ఇస్తారన్న సంగతి తెలిసిందే. ఖాళీ సమయాల్లో పిల్లలు సితార, గౌతమ్ లతో కలిసి కాలక్షేపం చేస్తుంటారు. ఇక వారి స్వీట్ మెమరీస్ ను నమ్రత ఎప్పటికప్పుడు కెమెరాలో బంధిస్తుంటారు. అంతేకాదు వాటిని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో కూడా పంచుకుంటూ ఉంటారు. మహేష్ గురించి కానీ, పిల్లలు సితార-గౌతమ్ లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు పలు ఆసక్తికర విషయాలగురించి ఏదో ఒకటి తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూనే ఉంటారు. ఇక తాజాగా తన ఇన్ట్సా ద్వారా మరో క్యూట్ పిక్ ను పంచుకున్నారు. అందులో మహేష్, సితార, గౌతమ్ లతో పాటు తమ పెట్ డాగ్ కూడా ఉంది. ఇక ఆఫొటోకు నమ్రత తమ బేబీస్ తో మహేష్ సరౌండెడ్ అని చెప్పి క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇక ఇప్పుడు ఈఫొటో అందరినీ ఆకట్టుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
ఇక మహేష్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం మహేష్ పరుశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట‘ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఏప్రిల్ 1వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ఇటీవలే ప్రకటించారు. ఈసినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక దీనితో పాటు మహేష్ త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ కు జోడీగా చేసిన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























