సూపర్ హిట్ “ఓం శాంతి ఓం “మూవీ తో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన దీపికా పడుకొనే పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “మహానటి “మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , దీపిక పడుకొనే జంటగా టైమ్ ట్రావెల్ నేపథ్యం లో భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీ “ప్రాజెక్ట్ K ” తెరకెక్కుతుంది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.ఈ మూవీ తో దీపిక టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, అల్లు అర్జున్ లపై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక ప్రశంసలు కురిపించారు. ఒక ఇంటర్వ్యూ లో దీపిక మాట్లాడుతూ .. ఎన్టీఆర్ నటించిన కొన్ని సినిమాలు , “RRR”మూవీ ఫుటేజ్ ను చూశాననీ , ఆయన యాక్టింగ్ స్టైల్ చూసి మంత్ర ముగ్ధు రాలిని అయ్యాననీ , “పుష్ప :ది రైజ్ “మూవీ లో అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ అద్భుతం అనీ , హీరో ప్రభాస్ ట్రూ జెంటిల్ మెన్ , ఫ్రెండ్లీ పర్సన్ అనీ , ఎన్టీఆర్ , అల్లు అర్జున్ లతో నటించడానికి ఆసక్తి తో ఉన్నాననీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: