అడివి శేష్ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా మేజర్. పాన్ ఇండియా రేంజ్ లో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఈసినిమాను కూడా ఫిబ్రవరి 11న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఈసినిమాను కూడా వాయిదా వేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ప్రస్తుతం వాయిదా పడిన సినిమాలన్నీ మళ్లీ కొత్త రిలీజ్ డేట్లను ఫిక్స్ చేసుకుంటున్నాయి. ఈనేపథ్యంలో మేజర్ రిలీజ్ డేట్ పై అడివి శేష్ తన సోషల్ మీడియా ద్వారా అప్ డేట్ ఇస్తూ ఎమోషన్ పోస్ట్ పెట్టారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మేజర్ సినిమా సరైన సమయంలో అలాగే సరైన తేదీకే తీసుకొస్తామని ఎందుకంటే అది కేవలం సినిమా కాదు అది నా నిజం అంటూ పోస్ట్ లో పేర్కొన్నాడు. మరి త్వరలోనే ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అప్ డేట్ ఇస్తారేమో చూడాలి.
Cinema is truth 24 Frames per second – Jean Luc Godard #MajorTheFilm
Release will be decided the RIGHT way. For the RIGHT date.Because this isn’t just a movie. It’s my truth. #MAJOR ka promise hai yeh.
— Adivi Sesh (@AdiviSesh) February 2, 2022
కాగా ముంబై 26/11 సంఘటన ఆధారంగా ఈసినిమాను తెరకెక్కిస్తున్న సంగతి కూడా తెలిసిందే. 26/11 ముంబై టెర్రర్ అటాక్లో అమరవీరుడైన ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈసినిమాను తీశారు. ఈ సినిమాలో శోభితా ధూళిపాళ్లతో పాటు సయీ మంజ్రేకర్ కూడా మరో కథానాయికగా నటిస్తుంది. ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మహేష్ హోమ్ బేనర్ జీఎంబీ ప్రొడక్షన్స్ సోనీ పిక్చర్స్తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, మలయాళంలో కూడా రిలీజ్ చేయనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: