సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ 2022 సంవత్సరం ఏప్రిల్1 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో సముద్రఖని , వెన్నెల కిషోర్ , సుబ్బరాజు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , మహేష్ బాబు బర్త్ డే బ్లాస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
”సర్కారు వారి పాట”మూవీ దుబాయ్ , హైదరాబాద్ , గోవా , స్పెయిన్ లలో షూటింగ్ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న విషయం తెలిసిందే. ”సర్కారు వారి పాట”మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. హీరో మహేశ్ బాబు మోకాలు సర్జరీ, కొవిడ్ బారిన పడిన కారణంగా ఈ సినిమా షూటింగ్ గత కొంతకాలంగా వాయిదా పడింది.ప్రస్తుతం మహేష్ కరోనా నుండి పూర్తిగా కోలుకోవడం తో చిత్ర యూనిట్ కొత్త షెడ్యూల్ మొదలుపెట్టేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 2వ తేదీ నుంచి మహేశ్ సెట్స్లో అడుగుపెట్టనున్నట్టు , మొత్తం చిత్రీకరణ మార్చ్ వరకు పూర్తి చేయనున్నారని సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: