క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మెగా హీరో వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం కొండపొలం. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించాడు క్రిష్. ఇక ఈసినిమా అక్టోబర్లో థియేటర్లలో రిలీజైన సంగతి తెలిసిందే. ఇటీవలే ఓటీటీలోకి కూడా వచ్చేసింది. అయితే ఓటీటీ నుండి కూడా ఈసినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈసినిమాను చూసిన ఆడియన్స్ తమ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ప్రశంసలు కురిపించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ఇప్పుడు బుల్లి తెరపై కూడా సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. తాజాగా కొండపొలం సినిమా టెలివిజన్ లో ప్రసారమైన సంగతి తెలిసిందే కదా. అయితే ఈసినిమాకు మంచి టీఆర్పీ రేటింగ్ దక్కింది. స్టార్ మాలో ప్రసారమైన ఈసినిమాకు అర్బన్లో 12.34 టీఆర్పీ రేటింగ్, అర్బన్ మరియు రూరల్లో కలిపి 10.54 టిఆర్పీ రేటింగ్ వచ్చింది.
కాగా ఈసినిమాలో ఇంకా కోట శ్రీనివాసరావు, సాయిచంద్, హేమ, రచ్చ రవి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించగా.. జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి సంయుక్తంగా ఈసినిమాను నిర్మించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: