మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న భారీ అంచనాలతో దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా సుమారు 300కోట్లు కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.“పుష్ప: ది రైజ్” మూవీ కలెక్షన్స్ US లో 2మిలియన్ డాలర్స్ పైగా రాబట్టింది. రఫ్ అండ్ మాస్ అవతార్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అల్లు అర్జున్ అందుకుంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Hey @alluarjun , After the fate of biggies like #Anthim #SatyamevaJayate2 and #83 Kudos to you with #Pushpa for making REGIONAL CINEMA into NATIONAL CINEMA 💐💐💐 🙏🙏🙏💪💪💪
— Ram Gopal Varma (@RGVzoomin) January 5, 2022
“పుష్ప: ది రైజ్” మూవీ బాలీవుడ్ లో భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. తాజాగా అల్లు అర్జున్ పై దర్శకుడు ఆర్ జి వి సోషల్ మీడియా ద్వారా ప్రశంసలు కురిపించారు. “83”, “అంతిమ్ :ది ఫైనల్ ట్రూత్”, “సత్యమేవ జయతే 2 ” వంటి బాలీవుడ్ మూవీస్ పోటీగా ఉన్నప్పటికీ “పుష్ప: ది రైజ్” మూవీ తో ప్రాంతీయ సినిమాని జాతీయ సినిమాగా మార్చినందుకు ధన్యవాదాలు అంటూ ఆర్ జి వి ట్వీట్ చేశారు. ఆర్ జి వి ట్వీట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: