బాహుబలి ఫ్రాంచైజ్ తరువాత ప్రభాస్ రేంజ్ ఏ స్థాయిలో పెరిగిందో తెలిసిందే కదా. ఆ తరువాత వచ్చిన సాహో సినిమా ఇక్కడ అంత ఫలితాన్ని ఇవ్వలేకపోయినా నార్త్ ఆడియన్స్ కు మాత్రం చాలా బాగా నచ్చేసింది. అందుకే హిందీలో ఈసినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. ఇక సాహో తరువాత ప్రభాస్ ఏకంగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే. రాధేశ్యామ్ రిలీజ్ కు సిద్దంగా ఉండగా.. ఆదిపురష్, సలార్, ప్రాజెక్ట్ కే, ఇంకా పట్టాలెక్కని స్పిరిట్ ఇలా అన్నీ పాన్ ఇండియా ఇంకా భారీ బడ్జెట్ సినిమాలే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా వీటిలో పలు సినిమాలకు భూషణ్ కుమార్ కూడా ఒక నిర్మాతగా ఉన్నారు. ఈనేపథ్యంలో తాజాాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తను ప్రభాస్ సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ రీజనల్ బారియర్స్ లేకుండా సినిమాలు చేయాలనుకుంటున్నాడు.. ఇప్పుడు ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అంతేకాదు ఒక నిర్మాతగా నాకు కూడా పాన్ ఇండియా సినిమాలు చేయాలని ఉంటుంది. నిజానికి సాహో సినిమా పెద్దగా బిజినెస్ చేయలేదు.. అయినా కూడా హిందీ మూవీస్ కు మాత్రం ప్రభాస్ హిట్ బిజినెస్సే. ఇంకా ఆది పురుష్ గురించి చెబుతూ.. ఆది పురష్ కథ ప్రభాస్ కోసం తయారు చేయబడిన కథ.. ఈసినిమాలో రాముడిగా ప్రభాస్ అద్భుతంగా నటించాడు.. ఈసినిమా కోసం మేము కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం.. అనుకున్న సమయానికే వస్తుందని అనుకుంటున్నాం.. ఆడియన్స్ కు ఖచ్చితంగా ఈసినిమా విజువల్ ట్రీట్ అవుతుంది అని తెలిపారు.
ఇంకా స్పిరిట్ సినిమా గురించి చెబుతూ.. సందీప్ రెడ్డి వంగా కబీర్ సింగ్ సినిమా చేశాడు.. నార్త్ ఆడియన్స్ కు ఏం కావాలో తనకు తెలుసు.. ఈసినిమాలో ప్రభాస్ ఫస్ట్ టైమ్ పోలీస్ గా కనిపించనున్నాడు.. ఈసినిమా 2023లో సెట్స్ పైకి వెళుతుంది.. ఇది ప్రభాస్ కు సిల్వర్ జూబ్లీ సినిమా.. అందుకే ఈసినిమా ఖచ్చితంగా అటు ప్రభాస్ కి ఆయన ఫ్యాన్స్ కు స్పెషల్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నాం అంటూ స్పష్టం చేశారు.
కాగా స్పిరిట్ సినిమాను టీ సిరీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో భూషణ్ కుమార్ నిర్మించనున్నాడు. ఈ సినిమాను ఏకంగా ప్రపంచవ్యాప్తంగా 8 భాషల్లో రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. మరి చూద్దాం వీటిలో ఎన్ని సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేస్తాయో..
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: