టాలీవుడ్ ప్రముఖ సీనియర్ డైరెక్టర్ పి.చంద్రశేఖర్ రెడ్డి నేడు కన్నుమూసిన సంగతి తెలిసిందే కదా. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఇక ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు పి.సి.రెడ్డికి సంతాపం తెలియజేస్తున్నారు. ఇక పి.చంద్రశేఖర్ రెడ్డి మృతిపట్ల సూపర్ స్టార్ కృష్ణ స్పందించి భావోద్వేగానికి గురయ్యారు. ఆయన కుటుంబానికి సంతాపం తెలియచేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రముఖులు పి.చంద్రశేఖర్ రెడ్డి గారు మాకు వ్యక్తిగతంగా మరియు మా కుటుంబానికి అత్యంత సన్నిహితంగా కలిసిపోయే ఆప్తులు.. ఆయన దర్శకత్వంలో వచ్చిన తొలి చిత్రంలో నేను హీరోగా నటించాను..తొలిచిత్రం అత్త కోడళ్ళు.. రెండవ చిత్రం అనురాధలలో కూడా హీరో.. మా కాంబినేషన్ లో 23 చిత్రాలు వచ్చాయి. వాటిలో ఇల్లు – ఇల్లాలు, కొత్త కాపురం, పాడిపంటలు, నా పిలుపే ప్రభంజనం లాంటి మంచి హిట్ మూవీస్ మాత్రమే కాకుండా ఇద్దరి కాంబినేషన్ లో 23 చిత్రాలు వచ్చాయి. పద్మాలయ అనుబంధ సంస్థలోనూ ఆయన డైరెక్టర్ గా వ్యవహరించారు. చాలా ఆప్తులైన వ్యక్తిని కోల్పోయామంటూ విచారం వ్యక్తం చేస్తూ.. వారి కుటుంబానికి సానుభూతిని తెలియజేశారు. ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ని ప్రార్థిస్తానని అన్నారు సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ అంటూ విచారం వ్యక్తం చేశారు.
కాగా 1933 అక్టోబర్ 15న శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అనుమసముద్రం గ్రామంలో జన్మించారు చంద్ర శేఖర్ రెడ్డి. 1959లో అసిస్టెంట్ డైరెక్టర్గా సినీరంగ ప్రవేశం చేసిన ఆయన తన సినీ కెరీర్లో సుమారు 80 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు లాంటి టాలీవుడ్ లెజెండరీ నటులతో ఆయన పని చేశారు. అందులో సూపర్ స్టార్ కృష్ణ చిత్రాలకు ఎక్కువగా దర్శకత్వం వహించారు. 2014లో వచ్చిన జగన్నాయకుడు సినిమా ఆయన ఆఖరి సినిమా.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: