క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా శాకుంతలం. మహాభారతంలోని ఆది పర్వం.. అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా సినిమా తెరకెక్కుతుంది. ఇక షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈనేపథ్యంలో తాజాగా కొత్త సంవత్సరంసందర్భంగా క్రేజీ అప్డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు ఓ వీడియోని విడుదల చేశారు. ఇక ఈసినిమాకు గ్రాఫిక్ వర్క్ చాలా ఉంటుంది కాబట్టి.. ఈవీడియోలో చూస్తుంటే దీనికోసం చాలామందే పని చేస్తున్నట్టు అర్థమవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
#Shaakuntalam Post production work in progress.@Gunasekhar1 @Samanthaprabhu2 @ActorDevMohan @neelima_guna #Manisharma @GunaaTeamworks @DilRajuProdctns@SVC_official #MythologyforMilennials #EpicLoveStory#HappyNewYear2022 pic.twitter.com/9OuICOnLCa
— Gunaa Teamworks (@GunaaTeamworks) January 2, 2022
కాగా ఈసినిమాలో అదితి బాలన్ అనసూయగా, మోహన్ బాబు మహర్షి, అల్లు అర్హ ప్రిన్స్ భరత్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను గుణశేఖర్ తన స్వంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. 2022 ప్రధమార్థంలో ఈసినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: