నందమూరి బాలకృష్ణ ఇటీవలే అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. బోయపాటి-బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకొని కలెక్షన్ ల వర్షం కురిపిస్తుంది. ఇక ఈసినిమా తరువాత గోపీచంద్ మలినేని తో సినిమా చేస్తున్న సంగతి కూడా విదితమే. వాస్తవ సంఘటనల ఆధారంగా గోపీచంద్ మలినేని ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈసినిమాను ప్రారంభించారు కూడా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా బాలకృష్ణ సినిమాల్లో విలన్ కు ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లెజెండ్ సినిమాలో విలన్ గా నటించిన తరువాత జగపతిబాబు రేంజ్ ఎలా మారిందో చూశాం. ఇక అఖండ సినిమాలో విలన్ గా చేసిన శ్రీకాంత్ కు ఎన్ని ప్రశంసలు దక్కాయో కూాడా చూశాం. ఇక ఇప్పుడు తన కొత్త సినిమా కోసం కూడా కథకు సరిపోయే విలన్ ను సెలక్ట్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో బాలయ్యకు విలన్ గా కన్నడ విలక్షణ నటుడు దునియా విజయ్ ను ఎంపిక చేశారు. ఇక ఈవిషయాన్ని చిత్రబృందం నేడు అధికారికంగా ప్రకటించింది. కన్నడంలో దునియా సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు విజయ్. దాంతో దునియా విజయ్ అయ్యాడు.
Very happy to welcome the Sandalwood Sensation #DuniyaVijay on board to #NBK107 🎉😊
Redefines the Villainism with #NBK107 👍🏻
NataSimham #NandamuriBalakrishna @shrutihaasan @officialviji @MusicThaman @MythriOfficial pic.twitter.com/x6mYe37rzu
— Gopichandh Malineni (@megopichand) January 3, 2022
కాగా ఈసినిమాలో శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన్సర్ పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ కలిసి ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు సినిమాటోగ్రఫి రిషి పంజాబీ అందిస్తున్నాడు. సాయి మాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: