మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న భారీ అంచనాలతో , భారీ ఎత్తున రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. రఫ్ అండ్ మాస్ అవతార్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అల్లు అర్జున్ , రష్మిక ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అల్లు అర్జున్ అందుకుంటున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“పుష్ప:ది రైజ్” మూవీని బాలీవుడ్లో గోల్డ్మైన్స్ టెలిఫిల్మ్స్ వారు విడుదల చేశారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సోషల్ మీడియా ద్వారా ఈ మూవీ ని ప్రశంసించారు. అల్లు అర్జున్.. మీరు నటించిన “పుష్ప ది రైజ్” చిత్రానికి ఇండియా అంతటా వస్తున్న మాసివ్ రెస్పాన్స్కి అభినందనలనీ , మన సినిమా ఇండస్ట్రీకి ఇది మరో పెద్ద విజయం అనీ , త్వరలోనే ఈ సినిమాని చూస్తాననీ అక్షయ్ కుమార్ ట్వీట్ చేయగా.. ధన్యవాదాలు అక్షయ్ జీ. మీ హృదయపూర్వక శుభాకాంక్షలకు ధన్యవాదాలనీ , మీకు కూడా శుభాకాంక్షలనీ , ప్రేక్షకులు మళ్లీ థియేటర్లకు వస్తున్నందుకు సంతోషంగా ఉందనీ , భారతీయ చలనచిత్ర పరిశ్రమ మళ్లీ కళకళలాడుతోందనీ అల్లు అర్జున్ రిప్లయ్ ఇచ్చారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: