యంగ్ హీరో సందీప్ కిషన్ మాత్రం గ్యాప్ లేకుండా ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమాతో ఈఏడాదిని ప్రారంభించిన సందీప్ కిషన్.. తాజాగా గల్లీ రౌడీ సినిమాను కూడా రిలీజ్ చేశాడు. కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ప్రస్తుతం తను వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. వీఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా సినిమా వస్తున్నట్టు ఎప్పుడో ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమాను రూపొందిస్తున్నారు. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. కాగాహాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండ నిర్మిస్తున్న ఈసినిమాకు బాలాజీ గుట్ట సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాతో పాటు సందీప్ కిషన్ మైఖేల్ అనే సినిమాను కూడా చేస్తున్నాడు. ఈసినిమాలో విజయ్ సేతుపతి కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈసినిమా షూటింగ్ దశలో ఉండగా నేడు ఈసినిమాలో నటిస్తున్న హీరోయిన్ ను అధికారికంగా ప్రకటించారు. మజిలీ సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టిన దివ్యాంశ కౌశిక్ ఈసినిమాలో సందీప్ కు జోడీగా హీరోయిన్ గా నటిస్తుంది.
కాగా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాను రంజిత్ జయకోడి దర్శకత్వంలో నారాయణ్ దాస్ కె. నారంగ్ సమర్పణలో భరత్ చౌదరి, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాను తెలుగు తో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: