మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలోని యాక్షన్ థ్రిల్లర్ గా 2 భాగాలుగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ “పుష్ప” ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో విడుదల కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“పుష్ప: ది రైజ్” ఈనెల 17న విడుదల కానున్న నేపథ్యంలో నిర్మాతలు నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ మీడియాతో ముచ్చటించారు. మైత్రీ మూవీమేకర్స్ సీఇవో చిరంజీవి (చెర్రీ) కూడా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ .. ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో కలిపి మూడువేల థియేటర్స్లో విడుదల చేస్తున్నామనీ , పాన్ ఇండియన్ సినిమా చేయాలనే మా కల నెరవేరిందనీ , అల్లు అర్జున్ నటన అద్భుతమనీ , గత చిత్రాలకు భిన్నంగా కొత్త పంథాలో అల్లు అర్జున్ నటించారనీ , అల్లు అర్జున్ కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా అవుతుందనీ , స్క్రీన్ప్లే రేసీగా ఉంటుందనీ , “పుష్ప” సెకండ్పార్ట్ షూటింగ్ను ఫిబ్రవరిలో మొదలుపెడతామనీ , ప్రస్తుతం మా సంస్థలో మహేష్బాబు “సర్కారువారి పాట”, నానితో “అంటే సుందరానికీ !” సినిమాలు చేస్తున్నామనీ , #MEGA154 సినిమా చిత్రీకరణ ఇటీవల మొదలైందనీ , బాలకృష్ణతో చేయబోతున్న చిత్రాన్ని వచ్చే నెలలో సెట్స్పైకి తీసుకొస్తామనీ , కల్యాణ్రామ్తో అమిగోస్ అనే చిత్రం చేయబోతున్నామనీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: