నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా” మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో హీరో నాని కథానాయకుడిగా కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగరాయ్ ” మూవీ డిసెంబర్ 24న విడుదల కానుంది. సాయి పల్లవి , కృతి శెట్టి , మడోన్నా సెబాష్టియన్ కథానాయికలు. జిషు సేన్ గుప్తా , మురళీ శర్మ కీలకమైన పాత్రలలో నటించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా లెజండరీ లిరిక్ రైటర్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసిన చివరి పాట “సిరివెన్నెల” లిరికల్ వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. అద్భుతమైన సాహిత్యంతో మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా.. అనురాగ్ కులకర్ణి పాడిన ఈ పాటకు విశేషమైన స్పందన లభిస్తోంది. ఇక ఇది సిరివెన్నెల రాసిన చివరి పాట కావడంతో సాయి పల్లవి స్పందించారు. మీరు రాసిన ప్రతి పదం మీ ఆత్మను తీసుకు వస్తుందనీ , మీరు ఎప్పటికీ మా హృదయాల్లో ఉంటారనీ అంటూ సాయి పల్లవి ట్వీట్ చేశారు. సాయి పల్లవి ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: